Home » Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా జెలన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రస్తావన తెచ్చారు. దేశంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
చైనాలో ప్రధాని పర్యటించడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2018లో ఆయన చైనాలో పర్యటించారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.
జపాన్-భారత్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన జపాన్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వార్షిక సమావేశంలో జపాన్ ప్రధానితో కలిసి పాల్గొంటారు. సెమీ కండక్టర్, బుల్లెట్ రైళ్ల తయారీ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.
2018లో జరిగిన ఇన్ఫార్మల్ సమిట్కు మోదీ వెళ్లారు. వూహాన్లో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల వల్ల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ ఎమ్మెల్యే తేజస్విపై ఆయన ఫిర్యాదు చేశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య అనుబంధాన్ని బలపరిచేలా, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై శాంతియుత పరిష్కారాల దిశగా ఈ సంభాషణ సాగింది.
18000 Cr Projects: ఎన్హెచ్ 31పై 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది.
గత పండుగ సీజన్కి ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారిన క్రమంలో, ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో పరిస్థితి మారబోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కీలకమైన దౌత్య సమావేశం జరిగింది. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని స్వాగతించారు. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త బాటలు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.