Home » Narendra Modi
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవటంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్డాన్లోని హషెమెట్ కింగ్డమ్ వెళతారు.
ఆస్ట్రేలియాలోని బాండి బీచ్లో ఉగ్రమూక జరిపిన దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఏమాత్రం సహనం లేదని, ఉగ్రవాదపు అన్ని రూపాలు.. ప్రదర్శనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము మద్దతిస్తామని భారత ప్రధాని..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు రూ. 11,718 కోట్ల బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా జనాభా, డెమోగ్రఫిక్ వివరాలు సేకరణకు సహాయపడుతుంది. ఇంకా..
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. రజనీ కలకాలం ఎంతో ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థించారు.
లోక్సభలో వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతర గీతం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శుక్రవారం పుతిన్ , ప్రధాని మోదీ మధ్య హైదరాబాద్ భవన్లో ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చర్చ జరిగింది. అలానే ఇరుదేశాల స్నేహం మరింత బలపడే విధంగా వీరి చర్చ సాగినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. వీరి భేటీ సమయంలో ఇరు దేశాధినేతల మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.