Home » Municipal elections
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. హస్తం పార్టీ విజయంపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు నేతలను రేవంత్రెడ్డి కలుస్తున్నారు.
పఠాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇక్కడ 5 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్కు అత్యధిక వార్డులు దక్కాయి.
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీలను బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డుని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్లో వేయడం సంచలనంగా మారింది.
జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.