Home » Municipal elections
మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య సంఘటనను.. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో ప్రస్తావించారు . బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్ గా జరుగుతున్న ఎన్నికలు కావడంతో భద్రత పెంచామని చెప్పారు..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది..
మున్సిపల్ ఎన్నికల వేళ శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ నిషేధాజ్ఞలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..
తెలంగాణ మంత్రి అజారుద్దీన్పై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకుంటే.. ఆయన మంత్రి పదవి పోతుందని అన్నారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్తో పాటు చైర్మన్ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధాన పార్టీలు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.
మునిసిపల్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ఆకర్శించడానికి రకరకాల ఎత్తులు ప్రదర్శిస్తున్నారు. మైకులు, కళాకారుల ఆట పాటలతో ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు.
సిరిసిల్ల పట్టణం బివైనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్లా జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు.