Home » Mulugu
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని స్వగ్రామానికి వచ్చారు.
కోతల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పున: నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గద్దెల పున: నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని.. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు.
నిర్భయ నిధి కింద తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే విమర్శలను 'చౌకబారు విమర్శలు'గా రేవంత్ కొట్టిపారేశారు. పక్క రాష్ట్రాలతో చర్చించి తెలంగాణ నీటి హక్కులను కాపాడతామన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేయొద్దని హితవు పలికారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట ప్రజాపరిషత్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్యాలయానికి సంబంధించిన కీలక పత్రాలు, రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కేరళ రాష్ట్రంలో అమలు చేసిన కుటుంబశ్రీ మోడల్ను అనుసరించి.. తెలంగాణలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ పథకం ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామన్నారు.