Home » Minister Satya Kumar
ఏపీలో మాతాశిశు సంరక్షణ కోసం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు సిద్ధమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా తల్లీబిడ్డల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ఈ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102 వాహనాలు) సేవలను మంగళవారం ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆయుశ్కు కేంద్రప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయుశ్ బడ్జెట్ రూ.1,070 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.
కొవిడ్- 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు రూ. 105 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పీఎ్సఏ (ప్రెసర్ స్వింగ్ అడ్సార్ప్షన్) ప్లాంట్లు నిరుపయోగంగా ఎందుకు మారాయని అధికారులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు.
రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి చేర్చకపోవటానికి దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.
ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
ఆర్థిక, అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పేదరికాన్నీ నిర్ములించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.