Home » Minister Satya Kumar
ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
ఆర్థిక, అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పేదరికాన్నీ నిర్ములించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రెండేళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి, ప్రణాళికలను ప్రజలకు చెబుతున్నామని తెలిపారు.
ఈ ఏడాది జూన్ 7 నుంచి 21 వరకు15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు.
వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.
వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంపై ఏపీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అస్సాంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని తెలిపారు.
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్లో మంత్రుల బృందం పర్యటించనుంది.
నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఏపీ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్.ఎస్.ఎస్.ఏ. ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు.