Home » Minister Nara Lokesh
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్కు మరో అరుదైన గౌరవం దక్కింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్లో భాగస్వామ్యం కావాలని లోకేష్కు ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆహ్వానం పలికింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్ హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు.