Home » Medical News
డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్గ్రేడేషన్ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మందులు, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్రావు ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)లో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సీటు రాదని తేలిపోయిన విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు వరుస కడుతున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించారు. గర్భిణుల కోసం అత్యవసర చికిత్సకూ సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
'మీరు చనిపోయినా మీ కళ్లు అందమైన అమ్మాయిల్ని చూడాలని కోరుకుంటున్నారా! అయితే నేత్రదానం చేద్దాం..' అనేది ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన ఈ ప్రకటన యువతలో నేత్రదానంపై అవగాహన తీసుకొచ్చింది ఈ ప్రకటన. యువతను ఆలోచింప చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
గాంధీలో తొమ్మిది ఎక్స్రే యంత్రాల్లో ఏడు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలాఖారు నాటికి మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారత ఎగుమతి రంగాలు
సృష్టి ఫెర్టిలిటీ కేసులో వైసీపీ నేత సోదరుడు కీలకంగా ఉన్నట్లు సమాచారం. సృష్టి కేసులో అరెస్ట్ అయిన విశాఖ కేజీహెచ్కు చెందిన ముగ్గురు వైద్యులు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరు డాక్టర్ వాసుపల్లి రవికుమార్ కూడా ఉన్నారు. కేజీహెచ్లో అనస్తీషియాలజీ విభాగాధిపతిగా, డిప్యూటీ సూపరింటెండెంట్గా రవి కుమార్ కొనసాగుతున్నారు.
ప్రాణాలు కాపాడే వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతున్నారు. గంజాయి విక్రయం కేసులో ఇటీవల బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్కు చెందిన జరీనా బేగంను పోలీసులు అరెస్టు చేశారు.
కోస్తా జిల్లాలకే తలమానికంగా నిలుస్తున్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి రోజురోజుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పలు విభాగాల్లో మహిళా రోగులకు వైద్య పరీక్షలను పురుష సిబ్బందే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2డి ఎకో, ఈసీజీ టెస్టులను పురుష సిబ్బంది నిర్వహిస్తుండటంతో మహిళలు చెప్పలేని మానసిక వేదన ఎదుర్కొంటున్నారు.