Home » Medical News
పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది.
స్విమ్స్ ఓపీడీ బ్లాకు వద్ద వున్న 3వ నెంబరు బ్రాండెడ్ మందుల షాపులో నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయించి రోగులను దోచేయడంతో పాటు వారి ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అరుదైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. గ్లైకోజెన్ స్టోరేజ్ సమస్యతో బాధపడుతున్న18 నెలల బాలుడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఒక షాకింగ్ మెడికల్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక వైద్యుడు చేసిన పొరపాటు వల్ల రోగి ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణాలు కోల్పోయాడు. శస్త్రచికిత్స సమయంలో రోగి ప్లీహాన్ని తీయాల్సిన డాక్టర్ పొరపాటున లివర్ను తొలగించాడు.
తమ ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు.
సమాజంలో ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ రోజు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. హెచ్ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు.
చాలా మంది రోజూ టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ ఒక చిన్న మాత్ర శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో శాస్త్రీయ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.
పీజీ వైద్య సీట్ల భర్తీపై కీలక నిర్ణయం వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్కు ఇకపై పొడిగింపు ఇవ్వలేమని న్యాయ స్థానం స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇప్పటికే 7 రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో మరింత పొడిగింపు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.