Home » Mancherial
మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
కవ్వాల టైగర్ జోన్లోని జన్నారం డివిజన్లో ఆదివారం నిర్వహించిన బర్డ్వాచ్ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్ కెమెరాల ద్వారా వీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్ కార్పొ రేషన్గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
గోదావరి తీరం నుంచి రాత్రి,పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. గుడిరేవు గోదావరి నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రైతుభరోసా, రేషన్కార్డుల సర్వేను పకడ్బం దీగా చేపట్టాలని ఆర్డీవో హరికృష్ణ సూచిం చారు. శనివారం కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలిం చారు. ఆర్డీవో మాట్లాడుతూ తప్పులు లేకుం డా వివరాలను నమోదు చేయాలని పేర్కొ న్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు మూడేళ్లుగా విడుదల కావడం లేదు. వీటిపై ఆధారపడ్డ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి. విద్యార్థులను వార్షిక పరీక్షల రుసుం చెల్లించాలని, పూర్తయిన వారికి ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. నిధులు విడుదల చేయాలని పలుమార్లు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడుతున్నారు.
కమ్యూనిస్టులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్ను శ్రీరాంపూర్లోని పార్టీ కార్యాల యంలో విడుదల చేశారు.
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో హరీష్రాజ్ అన్నారు. శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీ లించారు.
రాష్ట్రంలో మరో సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేతకు సిద్ధమవుతోంది. మంచిర్యాల పట్టణ సమీపంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) పీకల్లోతు నష్టాలు, అప్పులతో సతమతమవుతోంది.