Home » Mamata Banerjee
ఆర్జీ కర్ హాస్పిటల్ కేసు విషయంలో సీఎం మమతా బెనర్జీ మొబైల్ ఫోన్ తీసుకుని ఆగస్ట్ 9, 10 తేదీల్లో కాల్ రికార్డులను తనిఖీ చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. అప్పుడు అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. అంతేకాదు నిజానిజాలు తెలియాలంటే ముందుగా సీఎంను విచారించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద విధుల నిర్వహణలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. ఇది 'చరిత్రాత్మిక బిల్లు' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో ట్రయినీ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై అరెస్టయిన మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్కు కోర్టు 8 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఈ మేరకు కోల్కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదించనుంది. ఇందుకోసం సోమవారంనాడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతిపాదిత బిల్లుకు ''అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండమెంట్) బిల్లు 2024''గా పేరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బెంగాల్ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, ఒడిసా కూడా కాలిపోతాయని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా సమర్ధించారు. ఎంతో మెచ్యూరిటీతో మమత వ్యవహరించారని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కోల్కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్కతాలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది.