Home » Mamata Banerjee
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సందేశ్ఖలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ సోదరుడు ఆలంగీర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలు అయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యాలను ఆ ఫోటోలో మనం చూడొచ్చు.
దేశంలో ఇటివల పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ అంశంపై స్పందించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
బబూన్ బెనర్జీతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధాలు లేవని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బబూన్ను తన సోదరుడిగా పిలవద్దని సూచించారు. కుటుంబ పాలనను తాను నమ్మనని స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన మమతా బెనర్జీకి చిక్కులు తప్పేట్టు లేవు. హౌరా లోక్సభ నియోజకవర్గానికి ప్రసూన్ బెనర్జీని తిరిగి నామినేట్ చేయడంపై మమతా బెనర్జీ చిన్న తమ్ముడు బాబున్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే హౌరా సీటు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (Citizenship Amendment Act) అమలుపై ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్లో భాగమని తూర్పారపట్టారు.
పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. తద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్సభ ఎన్నికలకు పోటీచేసే 42 మంది అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించడంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ రాజకీయనాయకుడు కానీ, పార్టీ కానీ ఆమెను విశ్వసించలేరనే విషయాన్ని మమతా బెనర్జీ నిరూపించుకున్నారని అన్నారు.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగింది. 42 లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆదివారంనాడు ప్రకటించారు.