Home » Mamata Banerjee
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీలో అంతర్గత విభేదాలు ముదురుతున్న తరుణంలో మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టు షాకిచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రితబ్రత బెనర్జీకి వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో భవానీ పూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారంనాడు సవాలు చేశారు. కోల్కతా హైకోర్టులో ఈమేరకు పిటిషన్ దాఖలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ లీడర్ సుదీప్ బందోపాధ్యాయ్ అనూహ్యంగా తిరుగుబాటు క్యాంపులో చేరడం ఒకెత్తయితే, ఈయనే తిరుగుబాటు ఎంపీల గ్రూప్కు కొత్త లీడర్ కానున్నట్లు సమాచారం.
తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ తనయుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తాజాగా మమతాబెనర్జీ, పలువురు ఇతర నేతలకు లీగల్ నోటీసు పంపారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి తాజాగా ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ షాక్ ఇచ్చారు. టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో, అసన్సోల్ టీఎమ్సీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
పశ్చిమబెంగాల్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆమె రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల నుంచి తొలగించాలని పశ్చిమబెంగాల్లోని అధికార బీజేపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.