Home » Mamata Banerjee
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టటాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని అన్నారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ చర్యను సూపర్ ఎమర్జెన్సీతో ఆమె పోల్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవిష్యత్తులో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపడతారనే నమ్మకం ఉందని తెలిపారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల జాబితా నుంచి అర్హులైన ఒక్క ఓటరును తొలగించినా బీజేపీ ప్రభుత్వ పతనాన్ని తమ పార్టీ చూస్తుందని మమత హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్తో కేంద్రం కుమ్మక్కై ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక ఉపకరణంగా వాడుకుంటోందని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆమెను ఒడిశా పంపించాలంటూ..
కోల్కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని షోభాపూర్లోని ఒక ప్రైవేటు కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్కు చెందిన ఎంబీఎబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని (23) ఒక ఫ్రెండ్తో డిన్నర్ చేసి కాలేజీకి తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది.
బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ హద్దులు దాడితే ఆయనపై ఉన్న 'అవినీతి ఆరోపణలు' బయటపెడతామని ఒక సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, మంత్రి అరూప్ బిశ్వాస్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
అమిత్షా ప్రవేశపెట్టిన బిల్లులపై మమతా బెనర్జీ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఈ బిల్లులతో దేశంలో ప్రజాస్వామ్య శకం ముగిసినట్టేనని, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు చరమగీతం పాడినట్టవుతుందని ఆరోపించారు. ఈ బిల్లులతో ప్రధానికి, హోం మంత్రికి అధికారులు వస్తాయని, ఈ చర్య సూపర్-ఎమర్జెన్సీని మించిపోయే చర్య అని అభ్యంతరం తెలిపారు.
మమతా బెనర్జీ కేంద్ర రైల్వే మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో 1999 నుంచి 2001 వరకూ పనిచేశారు. రెండోసారి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో 2009 నుంచి 2011 వరకూ పనిచేశారు.
కోల్కతా లోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బెంగాల్ మళ్లీ ఒక్కసారిగా అట్టుడికింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ..