Home » Mahesh Kumar Goud
సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. కేబినెట్లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సుదీర్ఘ కాలం అజారుద్దీన్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి టూర్ షెడ్యూల్ ఖరారైంది.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని అన్నారు. ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలని కాబట్టే నవీన్ యాదవ్ను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిందని వెల్లడించారు.
పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని పీసీసీ చీఫ్ అన్నారు. పూర్తి వివరాలతో హైకోర్టులో వాదించినప్పటికీ స్టే విధించారని తెలిపారు.
బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు.
మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్యగా వెల్లడించారు. జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి పెట్టింది.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.