Home » Maharashtra
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో ఉత్కంఠ నెలకొనడంతో మహారాష్ట్ర రాజకీయం మరింత ముదురుతోంది. సీఎం దేవేంద్ర ఫడణవీస్తో జరిగిన వరుస భేటీలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీస్తున్నాయి.
పుణెలోని లోహగడ్ కోట వద్ద రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ భావోద్వేగ లేఖ రాశారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావటం లేదన్న బాధతో ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. అమ్మాయి కావాలంటూ బిల్బోర్డ్ ప్రకటన ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం జరగడంతో పాల డెయిరీ నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో సతారా జిల్లాలో వందల లీటర్ల పాలను మురుగు కాలువల్లో పారబోసిన ఘటన కలకలం రేపింది.
మహారాష్ట్రలో వైద్యులపై కార్పొరేటర్ దాడి ఉదంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేటర్ చేయి చేసుకున్న మహిళా డాక్టర్ తాజాగా రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో డాక్టర్లపై దాడి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ కార్పొరేటర్ రమేశ్ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
పుణేలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అధికారుల సమాచారం ప్రకారం, భవనం కూలిన సమయంలో అందులో ఉన్న 15 నుంచి 16 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.