Home » Maharashtra
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప అతడు బతకటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో అతడి భార్య లివర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీన ఆపరేషన్ జరిగింది.
బీడ్ జిల్లాలోని మంజర్సుమ్బాలో ఆదివారంనాడు నిర్వహించిన ర్యాలీలో మనోజ్ జారంగే మాట్లాడుతూ, తమ ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర రాజధానికి మళ్లించినట్టు చెప్పారు. తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామం నుంచి ఆగస్టు 27న ఈ ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు.
రాహుల్ గాంధీ వివాదాస్పద 'ఓట్ చోరీ' ఆరోపణలను పుణేలో శనివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో రాజ్ఠాక్రే సమర్ధించారు. ఎన్నికల్లో అవకతవకలు కొత్త అంశమేమీ కాదని, 2016-17లో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని అన్నారు.
Wedding Invite Scam: వెడ్డింగ్ ఇన్విటేషన్ల పేరిట ప్రతీ ఏటా వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతున్నాయి. చదువురాని వారే కాకుండా చదువుకున్న వాళ్లు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
మహారాష్ట్రలో నాసిక్లోని నిఫాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటీవల రాత్రి వేళ ఓ చిరుత పులి నిఫాద్ ప్రాంతంలోకి చొరబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు చిరుతను చూశాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మహారాష్ట్రలోని గడ్చిరోలీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ ఎమ్మెల్యే తేజస్విపై ఆయన ఫిర్యాదు చేశారు.
అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ప్లాజాలలో టోల్ మినహాయింపు కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనగోలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్ నుంచి బయల్దేరే పలు రైళ్ల రాకపోకలపై పడింది. ముంబై నుంచి హైదరాబాద్కు రావాల్సిన హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది.
సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సైఫాలిజిస్ట్ రెండ్రోజుల క్రితం చేసిన పోస్టులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తప్పుడు అభియోగాలకు ఊతమిచ్చేలా నిర్ధారణ కాని డాటాను సీఎస్డీఎస్ తీసుకొచ్చిందంటూ విమర్శించింది.
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ఆటోకు వేలాడుతున్న మహిళా పోలీసును ఓ ఆటో డ్రైవర్ ఏకంగా 120 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. స్థానికులు వెంటనే ఆటోను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సతారా జిల్లాలో ఈ దారుణం జరిగింది.