Home » Madhya Pradesh
తన ఎఫైర్ గురించి బయటపెట్టేస్తాడన్న భయంతో కన్న బిడ్డను హత్య చేసిన ఓ మహిళకు కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఓ యువకుడు ఏఐ వీడియోల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఆ యువకుడు ఏఐని ఉపయోగించి విమాన ప్రమాదం జరిగిందంటూ ఫేక్ వీడియోలు తయారు చేశాడు. దీంతో డుమ్నా ఎయిర్ పోర్ట్ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మధ్యప్రదేశ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన మాట కాదని భర్త నెయ్యిని తన తల్లికి ఇచ్చాడని తెలిసి కోపంతో ఊగిపోయిన ఓ మహిళ విషం తాగింది. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూసింది.
మధ్యప్రదేశ్లో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్లో గురువారం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఓ స్కూలు విద్యార్థి వీధి కుక్కల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దాదాపు ఆరు కుక్కలు అతడ్ని వెంబడించి దాడి చేయడానికి ప్రయత్నించాయి. బాలుడు వేగంగా అక్కడినుంచి తప్పించుకున్నాడు..
టీమిండియా మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ తండ్రి మున్నాసింగ్ గౌడ్ తిరిగి పోలీస్ శాఖలో పునర్నియామకం అయ్యాడు. 2012లో ఎన్నికల విధులు నిర్వహించడంలో పొరపాటు చేయడంతో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారు. అయితే భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచిన నేపథ్యంలో మున్నాసింగ్ గౌడ్ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్లో వెలుగుచూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఓ చిన్న ఆమ్లెట్ ముక్క ఆధారంగా ఛేదించారు. ఏఐ సాంకేతికత, సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమ్లెట్ ముక్క కీలక ఆధారంగా మారింది.
ఇండోర్లో నీటి కాలుష్యానికి ఏకంగా 10 మంది బలి కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మంచి నీటి పైప్లైన్లోకి మురుగు నీరు చేరడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే పైప్లైన్ను రిపేర్ చేశామని, కొన్ని రోజులు పాటు నల్లా నీటిని తాగొద్దని స్థానికులకు సూచించారు.
మధ్యప్రదేశ్ ఛత్తార్పూర్లో ఓ యువకుడు తన దగ్గరకు వచ్చిన నాగు పాముతో ఎలాంటి భయం లేకుండా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చలి మంట దగ్గర ఆగిన పాముతో ‘కాటు వేయకు’ అంటూ సంభాషించిన ఈ ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దేశంలోనే స్వచ్ఛ నగరంగా అవార్డులు పొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీటి వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భగీరథ్పురలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించారు. తాజాగా ఆ నీటిని పాలలో కలిపి ఇవ్వడంతో ఐదు నెలల బాలుడు మరణించాడు.