Home » Madhya Pradesh
రెవా - ప్రయాగ్రాజ్ హైవేపై బైక్ను ఆడీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ముగ్గురూ పెళ్లి పత్రికలు పంచడానికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ సరైన విధంగా సహాయం లభించకపోవడంతో అతడు తండ్రిని భుజాలపై మోసుకుని ఆస్పత్రి కారిడార్లలో తిరగాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన కూతురిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన నెట్టింట పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఓ అంగన్వాడీ ఆయా తేనెటీగల దాడి నుంచి 20 మంది పిల్లల్ని కాపాడి ప్రాణాలు కోల్పోయింది. ధీరత్వానికి ప్రతీకగా నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
హనుమాన్ ఆలయంలో పుట్టినరోజు వేడుక జరుపుకొంటున్న బీజేపీ ఎమ్మెల్యేపై ఇద్దరు దుండగులు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆయనపై దాడికి సైతం దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో ఆలస్యంగా వెలుగుచూసింది..
నమాజ్ చేసుకునేందుకు వచ్చే ముస్లిం కమ్యూనిటీ వ్యక్తుల జాబితాను జిల్లా యంత్రాంగానికి అందజేయాల్సి ఉంటుందని సీజేఐ సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్యా బాగ్చి, విపుల్ ఎం పాంచోలితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
చనిపోయిన తన యజమానిపై ఓ కుక్క ఎనలేని ప్రేమను చూపించింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు శవం దగ్గరే ఉంది. కొంచెం కూడా పక్కకు కదల్లేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
తన ఎఫైర్ గురించి బయటపెట్టేస్తాడన్న భయంతో కన్న బిడ్డను హత్య చేసిన ఓ మహిళకు కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఓ యువకుడు ఏఐ వీడియోల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఆ యువకుడు ఏఐని ఉపయోగించి విమాన ప్రమాదం జరిగిందంటూ ఫేక్ వీడియోలు తయారు చేశాడు. దీంతో డుమ్నా ఎయిర్ పోర్ట్ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మధ్యప్రదేశ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన మాట కాదని భర్త నెయ్యిని తన తల్లికి ఇచ్చాడని తెలిసి కోపంతో ఊగిపోయిన ఓ మహిళ విషం తాగింది. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూసింది.