Home » Lok Sabha
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
లోక్సభలో వందేమాతరం గేయంపై చర్చ జరగడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. బీజేపీ ఎంపీలు పదే పదే ఆ విషయమై చర్చించడం.. బెంగాల్లో రాబోయే ఎన్నికలకు ఆజ్యం పోసినట్టుందని విమర్శించారు.
ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.
లోక్సభలో వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతర గీతం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బంకించంద్ర ఛటర్జీ 'వందేమాతర గీతం' చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై లోక్సభలో చర్చ ఉంటుంది.
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
సంచర్ సాథీ యాప్తో వ్యక్తిగత జీవాతాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది..
నిబంధనలు ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల జైలు కానీ రూ.కోటి జరిమానా కానీ, రెండూకానీ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ గేమ్స్కు సంబంధించి అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకుంటే గరిష్టంగా రెండేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.