Home » lifestyle
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన చుట్టూ ఉండే వ్యక్తుల స్వభావం, వారి అలవాట్ల గురించి వివరించారు. ముఖ్యంగా అహంకారం, ఇతరులను అవమానించడం, చాడీలు చెప్పడం వంటి అలవాట్లు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు సూచించారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ప్రతి సంఖ్యకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని నమ్ముతారు. అందులో సంఖ్య 2ను భావోద్వేగాలు, సున్నితమైన మనస్తత్వానికి ప్రతీకగా చెబుతారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పానీయాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. వాటిలో సొరకాయ రసం ముఖ్యమైనది. అయితే దీనిని సరైన విధంగా తయారు చేసి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. తడి గోడలు, పాడైన వైరింగ్, సరైన ఎర్తింగ్ లేకపోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించడం వంటి చిన్న నిర్లక్ష్యాలు కూడా ప్రాణాపాయానికి దారితీయొచ్చు.
రాయలసీమ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రాగి ముద్ద ఆరోగ్యానికి వరం. కాల్షియం, ఐరన్, పీచుపదార్థాలు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే రాగి ముద్ద పిల్లల ఎదుగుదల నుంచి పెద్దల ఎముకల ఆరోగ్యం వరకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు సముద్ర తీర అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ ప్యాకేజ్ను అందిస్తోంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రాత్రులు–6 రోజుల యాత్రలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం చేసే దిశ, ఆహారాన్ని గౌరవించే విధానం, కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి కొన్ని అలవాట్లు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
బాత్రూమ్ టైల్స్ తడిగా ఉంటే జారి పడే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా బాత్రూమ్ టైల్స్ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల జుట్టు, తల చర్మంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పురుషులు జుట్టుకు నూనె రాసే విషయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తే జుట్టు రాలడం, చుండ్రు, స్కాల్ప్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ దేశాల సందర్శనకు 'మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్' పేరుతో 7 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది.