Home » Lebanon
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించారు. వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్ వైపు రాకెట్లు ప్రయోగించింది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడేలా కనబడడం లేదు. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పక్షాలూ దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.
లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ తెల్లవారుజామున లెబనాన్లోని వివిధ ప్రాంతాల్లో 50కి పైగా హెజ్బొల్లా మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది.
సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత లెబనాన్ - ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో లెబనాన్ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే సరిహద్దు ప్రాంతాల ప్రజలు, నిర్వాసితులు తమ నివాసాలకు పయనమయ్యారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అమలులోకి రానున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు.
లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇరాన్, హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఈ తెల్లవారుజామున విరుచుకుపడింది. 340కి పైగా లక్ష్యాలు ధ్వంసం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి చెందిన ఆయుధాగారాలు, లెబనాన్లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలపైనా దాడులు తీవ్రతరం చేసింది.