Home » Konda Surekha
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాయిని చేసిన విమర్శలపై మంత్రి స్పందించారు.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కేసులో సినీ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. హీరో నాగార్జునతో పాటూ ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. గతంలో కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
వేములవాడలోని దేవాలయం ఈవో నియామకంపై వార్త పత్రికల్లో విభిన్న కథనాలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం స్పందించింది.
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కాంగ్రెస్ థార్థ్ క్లాస్ పార్టీ అన్న వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి... ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించి తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు.
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలాల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి DPR సిద్ధం చేస్తున్నట్లు, వరంగల్ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ఫార్మా, బల్క్ డ్రగ్స్ కంపెనీలు ప్రమాణాలు పాటించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.