• Home » KonaSeema

KonaSeema

8 ఆటోలు సీజ్‌

8 ఆటోలు సీజ్‌

రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఎస్పీ బింధుమాధవ్‌ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 98 ఆటోలను సీజ్‌ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్‌ను కాకినాడ ట్రాఫిక్‌- 1, 2 పోలీస్‌స్టేషన్ల సీఐలు ఎన్‌ రమేష్‌, డి.రామారావు ఆధ్వర్యంలో జరిగింది.

 సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజ

సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజ

ఎంఎస్‌ఎంఈ, మిస్సింగ్‌ సిటిజన్స్‌ ఇన్‌ హౌస్‌ హోల్డ్స్‌, జియో ట్యాగింగ్‌, నాన్‌ రెసిడెన్సీ ఇన్‌ ఏపీ, చిల్డ్రన్స్‌ వితవుట్‌ ఆధార్‌, డెత్‌ ఆడిట్‌ ఇలా పలు సర్వేలను పూర్తిచేయడంలో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉండగా కాకినాడ జిల్లాలోని పె ద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు తదితర మున్సిపాల్టీలు వెనుకబడ్డాయి.

 వేలల్లో కోళ్లు మృత్యువాత

వేలల్లో కోళ్లు మృత్యువాత

గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కోళ్లు మరణిస్తూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే మరో రెండు వేల కోళ్లు మృత్యువా త పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్క ఫారంలోనే 4,500 కోళ్లు మరణించాయి.

మహాకుంభ మేళాకు ప్రత్యేక బస్సులు

మహాకుంభ మేళాకు ప్రత్యేక బస్సులు

మహాకుంభ మేళా యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమలాపురం ఏపీఎస్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు.

కొత్తగా భూఆధార్‌ నమోదు

కొత్తగా భూఆధార్‌ నమోదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని రైతులకు నేరుగా వర్తింపచేసేందుకు కొత్తగా భూ ఆధార్‌-ఫార్మర్‌ రిజిస్ర్టీ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు ఆదివారం తెలిపారు.

 కూరగాయల రైతులు గగ్గోలు

కూరగాయల రైతులు గగ్గోలు

హోల్‌సేల్‌గా కూరగాయల ధరలు దిగజారడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి కోత, రవాణా చార్జీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కూరగాయల పంటలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములు ప్రసిద్ధి. శ్రేష్ఠమైన లంక మట్టిలో ఏ రకమైన కూరగాయలు సాగు చేసినప్పటికీ మంచి దిగుబడులు వస్తాయి.

ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య

ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య

అన్నదాతలకు వ్యవసాయ సేవలను సులభతరం చేసి మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రతి రైతుకూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అందుబాటులోకి తీసుకురానున్నారు.

దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

దామోదరం సంజీవయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి

రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్యను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చెప్పారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేయడంతో పాటు 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.

బజార్ల బెంగ తీరినట్టే

బజార్ల బెంగ తీరినట్టే

జిల్లాలో కొత్త రైతుబజార్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తొలి దశలో మున్సిపాల్టీల పరిధిలో ప్రజల అవసరాలు తీర్చేలా వీటిని నిర్మించాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో అయిదేళ్ల తర్వాత తిరిగి వీటి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

టెన్త్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి