Home » KonaSeema
జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ధ్రువీకరించిన ఆక్వా రంగ చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ, మత్స్యశాఖ, ట్రాన్స్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు.
జిల్లాలోని వశిష్ఠ, గౌతమి నదుల్లో ఇసుక తవ్వకాలకు అనువైన రీచ్లను గుర్తించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. గుర్తించిన రీచ్ల అనుమతుల మంజూరు కోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబోమన్నారు.
ఈ నెల 4 నుంచి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశాల మేరకు సంపూర్ణ పారిశుధ్య చర్యలపై ప్రత్యేకంగా 860 మంది సిబ్బందిని నియమించినట్టు జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధి కారి జె.వెంకటరావు సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వ హణపై గురువారం కలెక్టరేట్లో రెవె న్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, ఇతర శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయ సమావేశం నిర్వహించా రు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం తోపాటు విద్యావికాసం దిశగా పాఠశాలలను నడిపించేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. దీనికిగానూ మౌలిక వసతుల కల్పనకు పాఠశాలల్లో ఇప్పటివరకూ జరిగిన నిధుల వినియోగం, చేపట్టిన పనులు ఏవిధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి, ఇంకా మిగిలిన పనులకు ఎంతమేరకు నిఽధులు కావాల్సి ఉందో ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ ట్రాన్స్ఫెరెన్సీ (ఏపీశాట్) ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా విద్యలో ప్రగతి సాధించేందుకు అమలుచేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకుంటోంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించాలని డీఈవో షేక్ సలీంబాషా పేర్కొన్నారు. ముమ్మిడివరం శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక విద్య ప్రేరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమవుతుందన్నారు.
శంకరగుప్తం మేజర్ డ్రెయిన్కు పూర్తిస్థాయిలో డ్రెడ్జింగ్ పనులు చేపడితే మురుగునీరు నేరుగా కేశవదాసుపాలెం వద్ద సముద్రంలో కలిసే అవకాశం ఉందని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించడంతో పాటు పాఠ్యాంశాలకు పట్టు సాధించే విధంగా ప్రత్యేక వీడియో క్లిప్పింగ్లను రూపొందించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. నిపుణులైన సబ్జెక్టు టీచర్లు రూపొందించిన వీడియో పాఠ్యాంశాల క్లిప్పింగ్లను బుధవారం అమలాపురం జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటినీ సూర్యఘర్ వెలుగులతో నింపుకోవాలన్నారు. కలెక్టరేట్లో బుధవారం పీఎం సూర్యఘర్ పథకం అమలు తీరు పురోగతిపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.