Home » KL Rahul
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 284 పరుగులు చేసింది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
భారత్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్తో జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్వెల్ తమ పరాజయంపై స్పందించాడు.
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ను తొలగించి.. కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాపై టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. సిరీస్ మొత్తంలో టాస్ గెలిచినప్పుడే ఎంతో ఆనందంగా ఫీలయ్యానని తెలిపాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ నిలకడ ప్రదర్శనపై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందించాడు.
సౌతాఫ్రికా-భారత్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కెప్టెన్గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో రాహుల్ కెప్టెన్సీలో ఫామ్ అందుకుని వరుసగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ .. ఈ సిరీస్లో మళ్లీ అదే రికార్డు తిరగరాయనున్నాడా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.