Home » KL Rahul
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. తాజాగా జియో హాట్స్టార్ నిర్వహించిన ‘సూపర్ స్టార్స్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని మాట్లాడాడు. ఒకప్పుడు తనను టీ20 ప్లేయర్గానే చూడలేదని, టెస్టు క్రికెటర్గా ముద్ర వేశారని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి భారత్ ఓపెనర్గా నిలిచాడు.
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టించింది. పంజాబ్ కింగ్స్పై జరుగుతోన్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగి ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 284 పరుగులు చేసింది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
భారత్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్తో జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్వెల్ తమ పరాజయంపై స్పందించాడు.
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ను తొలగించి.. కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాపై టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. సిరీస్ మొత్తంలో టాస్ గెలిచినప్పుడే ఎంతో ఆనందంగా ఫీలయ్యానని తెలిపాడు.