Home » Karimnagar
సింగరేణి కార్మికుల ఆశీ స్సుల కోసం వచ్చానని, సామాజిక తెలంగాణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేనకు సింగరేణి కార్మికుల మద్దతుగా నిలుస్తారని ఆశిస్తు న్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు.
మాజీమంత్రి కేటీఆర్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.
ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ విషయాలపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యమైన విత్తనాల సరఫరాలో ముల్కనూర్ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తోంది.
జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కల్యాణ మండపంలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్వైజర్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సింగరేణి యాజమాన్యంపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖనిలో నిరసన ప్రదర్శనకు దిగారు. ర్యాలీలో రామగుండం-1, 2, 3, భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లకు చెందిన వెయ్యి మంది అధికారులు పాల్గొన్నారు.
నేను ఎప్పటికీ సింగరేణి బిడ్డనే... ఎక్కడున్నా కార్మికుల కోసమే కొట్లాడుతా... 20ఏళ్లుగా సింగరేణి కార్మికులతో కలిసి పని చేస్తున్నాం... తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేసి రాష్ట్రం సాధించుకున్నాం... కేసీఆర్తో మాట్లాడి మీ కోసం పని చేశా... నేను చేసిన పోరాటాలతోనే 19వేల డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయి... మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు వచ్చేలా చేశా... అంటూ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని గోదావరిఖని ఏసీపీ రమేష్ అన్నారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని పలు స్కూళ్లు, కళాశాలల యజమానులు, బస్ డ్రైవర్లకు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో అవగాహన సదస్సును నిర్వహించారు.
జిల్లాలోని శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టు ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమంగా ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో స్పందించిన జిల్లా యంత్రాం గం ఏడాదిన్నర తర్వాత చర్యలకు దిగింది. ప్రాజెక్టు భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేసి సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ‘
ఓదెల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ నిర్మాణానికి రూ,15 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు.