Home » Karimnagar
ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారిని పారదోలాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగు లకు పండ్లు పంపిణీ చేశారు.
అంగ న్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నడిపిం చాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కవిత అన్నారు. మంగళవారం నర్సాపూర్లోని మూడు కేంద్రాలను పరిశీలించారు.
మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పద్మజరాణి అన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను మంగళవారం పరిశీలించారు.
కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (79) మంగళవారం హైదరాబాద్లో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ హైదారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపతిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, బీఫామ్ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.
మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో రాష్ట్ర మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డుల్లో.. 29 టికెట్లు ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం.
మాజీ సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ని గజగజ వణికించానని, తన తలకాయను కేసీఆర్ ఆరు ముక్కలు చేస్తానని గతంలో అన్నారని ఆరోపించారు. ఆయన సంగతి తేల్చేందుకు ఫామ్హౌస్కు వస్తానని తాను చెప్పానని అన్నారు.
సుల్తానా బాద్ మండలం నీరుకుళ్ల సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ సారి 21 లక్షల 988 రూపాయల ఆదాయం సమకూ రింది.
క్రీడల్లో గెలు పోటములు సహజమని ఎంపీడీవో శైలజారాణి, ఎస్ఐ శ్రీనివాస్లు అన్నారు. సోమవారం జెఎన్టీయు కళాశా లలో సీఎం కప్ మండల స్థాయి బహుమతి ప్రధానోత్స వంలో మాట్లాడారు. విద్యార్థులు క్రీడలను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.