Home » Karimnagar
జిల్లాలోని గొర్రెకాపరుల హక్కులు, ఆత్మగౌరవం, మార్కెట్ స్థలాల రక్షణ కోసం ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట గొంగడి ధర్నా నిర్వహించనున్నట్లు గొర్రెలకాపరుల సంక్షేమ సంఘం నాయకులు ప్రకటించారు.
రామగుండం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.248.66కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించింది. 2027 మార్చి నాటికి రూ.28.08కోట్లు మిగిలి ఉంటుందని అంచనా వేసింది. గత సంవత్సరం రూ.246.47కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదించగా ఈ ఏడాది రూ.2కోట్లు పెంచి రూ.248.66కోట్లకు అంచనా వేశారు.
ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ప్రభావిత ప్రాంతాల మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. టీటీఎస్లోని ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వ హించిన కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, మెటీరి యల్ను పంపిణీ చేశారు.
పదవితో ప్రజలకు మరింత సేవ చేస్తానని, తాను ఆశించి తెచ్చుకోలేదని ప్రభుత్వ విప్ చిం తకుంట విజయరమణారావు తెలిపారు. విప్ పదవి అనంతరం పెద్దపల్లికి వచ్చిన విజయర మణారావును దుబ్బపల్లి నుంచి పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు ర్యాలీగా తీసుకువచ్చారు.
నేలవాలిన పంటలకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని కూనారం, వెన్నంపల్లి, మంగపేట, జాఫర్ఖాన్పేట గ్రామాల్లో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన వల్ల నష్టపోయిన మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించారు.
అభివృద్ధి పనులను సకాలంలో గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలి పారు. శుక్రవారం కలెక్టర్ రామగిరి మండలం, మంథని పట్టణ పరిఽధిలో విస్తృతంగా పర్యటిం చారు. రామగిరి మండలంలోని కేజీబీవీ విద్యాల యం, తహసీల్దార్ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేజీబీవీలో ఏర్పాటు చేసిన మాడ్యులర్ కిచెన్ను ప్రారంభించారు.
కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని సూరంపేట, గంగారాంతండా అటవీ శివారులో రెండు ఆవులపై పెద్దపులి దాడిచేసి చంపగా ఆవుల కళేబరాలను గురువారం కొడిమ్యాల డీఎఫ్ఆర్వో ముషీర్ అహ్మద్, బీట్అధికారులు దహనం చేశారు.
గ్రామాల్లో గంజాయి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు.
తెల్లవారుతుండగా పక్షుల కిలకిల రాగాలతో పల్లెలు మేల్కొనేవి, ఎటుచూసినా పక్షుల రాగాలే... ఇంటి ముందు వేలాడదీసిన వరి గొలుకలు తింటూ పిచ్చుకలు సంగీతాన్ని వినిపించేవి.
రెండు నెలలుగా రోడ్ల నిర్మాణం లో భాగంగా పగిలిపోయిన మిషన్ భగీరథ పైపులైన్లను త్వరితగతిన మరమ్మతు చేయించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజని రవి ఇటీవల మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించారు.