Home » Karimnagar
పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలి టీలో మెజారిటీ వార్డు స్థానాల్లో గెలుపొందుతున్నామని, మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీ య కార్మికసంఘాలు గురువారం తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె సింగరేణిలో విజయవంతం అయ్యింది. సంస్థలోని 40వేల మంది కార్మికులు ఈ సమ్మెను సమర్థిస్తూ గురువారం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
రామగుండం మున్సిపల్ కార్పొరే షన్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావ రిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
శిథి లావస్థలో ఉన్న ఎస్సారెస్పీ కల్వర్టులకు మర మ్మతు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం గుండారం గ్రామపంచాయతీ పరి ధిలోని రాజాపూర్ రహదారిలోని ఎస్సారెస్పీ కాలువపై కల్వర్టు చెడిపోయి ప్రమాదకరంగా మారింది.
ప్రతి ఒక్కరూ బ్యాంకు లావా దేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ బేగం పేట్ ఎక్స్రోడ్ బ్రాంచ్ మేనేజర్ గోపికృష్ణ సూచించారు. బుధవారం లక్కారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.
రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. రెండుమూడు చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో బుధవారం పోలింగ్ ముగి సింది. బ్యాలెట్ బాక్స్లను స్ర్టాంగ్ రూంలకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం బాక్స్లో భద్రంగా ఉంది. ఈనెల 13న జరగనున్న కౌంటింగ్లో గెలుపెవరిదో తేలనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
కార్మిక సంఘాలు ఈ నెల 12న తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్జీ-3, ఏపిఏ జీఎం మధుసూ దన్, నాగేశ్వర్రావు కోరారు. మంగళవారం జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు.