Home » Karimnagar
రైతులు అందించే తోడ్పాటు వల్లనే ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు బలోపేతం అయ్యాయని ధూళికట్ట పీఎసీఎస్ పర్సన్ ఇన్చార్జి హైమద్ అలీ అన్నారు. శనివారం రైతువేదికలో ధూళికట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో ముఖ్యఅతిథిగా మాట్లా డారు.
సంక్షేమ హాస్టళ్ల నిర్వ హణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలి పారు. శనివారం కలెక్టరేట్లో హాస్టల్ వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ పిల్లలు భోజనం చేసే సమయంలో వార్డెన్లు తప్పకుండా హాస్టల్లో ఉండాలని, స్టడీ అవర్స్లో అందుబాటులో ఉండాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. అరైవ్, అలైవ్ ఫేస్-3 కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోదావరిఖని కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షించారు. జైశ్రీరాం నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది.
సేవ్ సింగరేణి పోరు జాత పేరిట కార్మికులను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు ఏఐటీ యూసీ తెర లేపుతుందని ఆర్జీ-3 ఉపాధ్య క్షుడు కొటరవీందర్రెడ్డి ఆరోపించారు. సింగ రేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసి పి-2లో ఏర్పాటు చేసిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు.
మహిళలకు సింగరేణి సేవా సమితి అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకొని సింగరేణి సేవా సమితి, లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో బంగ్లాస్ ఏరియాలో గురు వారం రాత్రి సేవా సమితి అధ్యక్షురాలు డీ అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.
సింగరేణి సంస్థలో అవసరానికి మించి అదనపు కార్మికులు 7వేలకు పైగా ఉన్నారని సంస్థ అంచనాకు వచ్చింది. వీరందరిని తొలగించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నది. గత సంవత్సరంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం, వారసత్వ ఉద్యోగా లను నిలిపివేయడం, కొత్త నియామకాలు లేకపోవడం వెనక అసలు మతలబు అవసరానికి మించి కార్మికులు ఉండడమనేది తేట తేల్లమవు తున్నది.
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో డెన్మార్క్కు చెందిన హల్దర్ టాప్స్ కంపెనీ సమకూర్చిన టెక్నాలజీ విఫలమైంది. కీలకమైన రూ.200కోట్ల విలువైన హై టెంపరేచర్ రిఫార్మర్(హెచ్టీఆర్) యంత్రం ఫెయిల్ అయ్యింది. దీని ప్రభావంతో గత ఖరీఫ్ సీజన్లో పరిశ్రమ షట్డౌన్ అయ్యింది.
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ప్రజలకు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్లో ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యులకు సూచించారు. గురువారం గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలు, క్రిటికల్ కేర్ సెంటర్, ఎక్స్రే, అల్ర్టా సౌండ్, ఫిజియోథెరపి, చిన్నపిల్లల విభాగాన్ని పరిశీలించారు.