Home » Karimnagar
బాలికల విద్య ద్వారనే మహిళా సాధికా రతను సాధించవచ్చని జిల్లా మహిళా సాధికా రిత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జాబు సుచరిత అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై మం గళవారం మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు.
రామగుండానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బోనంజా ప్రకటించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూ.17వేల కోట్ల పెట్టుబడులతో రెండు విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. జీవిత కాలం ముగియడంతో మూతబడిన బీ థర్మల్ స్థానంలో ఎన్టీపీసీ సహకారంతో 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మహిళలు మహాశక్తి ప్రతిరూపాలని, వారిని గౌరవించాలని ఎమ్మె ల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. సోమవారం జీడినగర్లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన టీఆర్టీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు.
కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు కొరిమి రాజ్కుమార్, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామమూర్తి, వడ్డేపల్లి దాస్ డిమాండ్ చేశారు.
మహిళలను ఆర్థి కంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి స్వరూప గార్డెన్లో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్ సూపర్ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులను ఈ నెల 18న మారెడ్మిల్లిలో బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు.
సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడు కలు ఘనంగా నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్క ర్రావుభవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక కుటుంబాల సమ్మేళ నానికి హాజరయ్యారు.