Home » Kandula Durgesh
రిషికొండ ప్యాలెస్ను టూరిజం రిసార్ట్గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
గోదావరి నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పరిశ్రమలు వ్యర్థాలను గోదావరిలో కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో భారత్ - అమెరికా బంధం బలోపేతమవుతోందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా సచివాలయంలో మంత్రి దుర్గేశ్తో ‘యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్షిప్ ఫోరమ్’ భేటీ గురువారం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఏపీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పోర్టుకు సంబంధించి డ్రెడ్జింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే అంతర్గత నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది.
తిరుపతి ఎస్ఐహెచ్ఎం సిబ్బంది వేతన కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో రూ.84 లక్షల బకాయిలు విడుదలయ్యాయి.