Home » Kandula Durgesh
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది.
ఏపీ మంత్రి కందుల దుర్గేష్కు వచ్చిన మావోయిస్టు బెదిరింపు లేఖపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఈ లేఖపై కందుల దుర్గేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిలిమ్ ట్యూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడామన్నారు.
అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు..
రాష్ట్ర ప్రజలకు మంత్రి కందుల దుర్గేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, నవ భారతావనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని మంత్రి పయ్యావుల తెలిపారు. రుషికొండ చివరి రెండు బ్లాక్లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు.
రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.