Home » KADAPA
కడప కొత్త మేయర్ పాకా సురేష్కు వ్యతిరేకంగా నగరంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మన కడపకు ఇదేం కర్మ.. సిగ్గు సిగ్గు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో కడప మేయర్గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, షఫీలు బలపరిచారు.
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విషయంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంపై ప్రివిలేజ్ కమిటీ సమావేశమై చర్చించింది. అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్వోను కమిటీ ప్రశ్నించింది.
మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
పులివెందుల పట్టణానికి.. నాడు సాగునీరు.. నేడు తాగునీరు.. ఆ ఘనత చంద్రబాబునాయుడిదేనని పలువురు పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే పులివెందుల బీడు భూముల్లో క్రిష్ణమ్మ జలాలు సవ్వడి చేస్త్తుంటే.. ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది.
రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలోని రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వెళ్లి.. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై వివరిస్తున్నారు.
దిత్వా తుపాన్ భారత్వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ సాగును లాభసాటిగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా డిసెంబరు 15 నుంచి నార్త్ నుంచి వ్యాపారులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసింది.
లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాజంపేట పట్టణం అభివృద్ధిలో తిరోగమన దిశలో పయనిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా, వందేళ్లుగా ఐఏఎస్ కేడర్ కలిగిన సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా ఎంతో పేరు గడించిన రాజంపేట పట్టణం కాలానికి తగినట్లు అభివృద్ధికి దూరంగా ఉంది.