Home » Jubilee Hills Bypoll
జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను ఎన్నికల అధికారి స్క్రూటినీ చేశారు. స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను మాత్రమే ఎన్నికల అధికారి ఖరారు చేశారు.
ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని దీపక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అన్నదమ్ముల లాంటి వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లంకల దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ను రద్దు చేయాలని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్ భార్య మాలిని అని.. సునీత కాదని ఆరోపించారు. మాలినితో గోపీనాథ్కు విడాకులు అవ్వలేదని ప్రద్యుమ్న పేర్కొన్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. ఎన్నికల అధికారులకి మొదటి సెట్ నామినేషన్ని అందజేశారు నవీన్ యాదవ్.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షణలో గురువారం ర్యాండమైజేషన్ నిర్వహించారు.
నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.
మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీన్సియర్ కాంగ్రెస్ వాదినని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బిహార్లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్రావు ప్రశ్నించారు.