Home » Jogi Ramesh
జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని.. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.
నకిలీ మద్యం కేసులో సీఎం చంద్రబాబు పీకల వరకు మునిగిపోయారని, ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇటువంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటినే కాదు.. అసెంబ్లీని కూడా ముట్టడిస్తా’ అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు ఇంటి దాడి కేసులో జోగి రమేశ్ సీఐడీ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు “తెలియదు” అనే సమాధానం ఇచ్చారు. మీడియా ఎదుట “మళ్లీ అధికారంలోకి వస్తాం” అంటూ ధీమా వ్యక్తం చేశారు
Jogi Ramesh CID Inquiry: చంద్రబాబు నివాసం వద్ద తాము ఏమీ దాడి చేయాలేదని.. తిరిగి వాళ్లే దాడి చేశారని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి.
అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఉదయం సిఐడి విచారణకు హాజరయ్యారు. అతనితో పాటు మరో ఐదుగురు కూడా హాజరయ్యారు.
ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేత జోగి రమేశ్తో కలిసి టీడీపీ నాయకులు, మంత్రి ర్యాలీలో పాల్గొనడం బాధాకరమని...
ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరచింది.
నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష హోదాకు సైతం ఆమడ దూరంలో వైసీపీ ఉండడంతో.. కీలక నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. ఆ క్రమంలో రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి.. పలువురు ఇప్పటికే టీడీపీలో చేేరారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ అధినేతకు మరో బిగ్ షాక్ తగిలిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది.