Home » Jogi Ramesh
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.
మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.
ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకి విజయవాడ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 6వ AJMFC కోర్టు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
జోగి బ్రదర్స్ను సిట్ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి సోదరులను సిట్ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.
విజయవాడ నకిలీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎనిమిది మంది నిందితులపై ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు నిందితుల పాత్రను ఛార్జిషీట్ లో సిట్ అధికారులు వివరించారు.
కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.
జోగి రమేశ్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్శాఖ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది.