Home » Jagitial
ఎన్నికల ప్రచారంలో భాగంగా కథలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 10వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ నామినేషన్ ప్రక్రియలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ(Telangana) ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్గాంధీపై (Rahul Gandhi) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ. తెలంగాణ వాటాలపై పార్లమెంట్లో ఒక్కరోజైనా కొట్లాడారా?
జగిత్యాల: దొరల తెలంగాణకు.. ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని.. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన జగిత్యాలలో పర్యటిస్తున్నారు.
జగిత్యాల జిల్లా: బీఆర్ఎస్ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండదని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
మోదీ నువ్వు గాంధీని పూజిస్తావా..? గాడ్సే ను పూజిస్తావా?, నిజామాబాద్లో చెప్పి వెళ్ళు. గాంధీని చంపిన గాడ్సేను పూజిస్తారా..? కాంగ్రెస్ హయాంలో కరెంటే లేదు.
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మర్డర్ మిస్టరీ వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు. చంపింది చెల్లెనే అని, చున్నీతో గొంతు నులిమి చంపారని ఆయన తెలిపారు. ఉమర్ను కోరుట్ల రమ్మని చందనే కోరిందని, దీప్తి, చందన ఇద్దరూ మద్యం తాగేలా ప్లాన్ చేసి.. చందన, ఉమర్ డబ్బు, నగదుతో పారిపోవాలని చూశారని జగిత్యాల ఎస్పీ భాస్కర్ వివరించారు.
కోరుట్ల పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోరుట్ల పట్టణంతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉంటున్న దీప్తి బంధువుల వివరాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.