Home » Jagitial
జగిత్యాల కాంగ్రెస్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి పుల్స్టాప్ పడినట్టైంది.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నట్లు స్పీకర్ తీర్పు ఇచ్చారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేద్దామని స్వగ్రామానికి వచ్చి తిరుగు పయనంలో హైదరాబాద్ వెళ్లే క్రమంలో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాలలోని పోరండ్ల సమీపంలో విద్యుత్ పోల్ను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గాలిపటాల సందడి మొదలైంది. అయితే గాలిపటంతో ఆడుకునే సమయంలో చైనా మాంజాతో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మెట్పల్లిలో చైనా మాంజా వల్ల గొంతు కోసుకుని నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందు ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంద మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తామని రూల్ పెట్టారా అని ప్రశ్నించారు.
కల్లూరు జిల్లాలో ఓ వింత కేసు వెలుగు చూసింది. తన సామాజిక వర్గం మహిళలు గాజుల పండగకు ఆహ్వానం ఇవ్వలేదంటూ.. ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది.