Home » Iran War
ట్రంప్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మరోసారి తేలింది. అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్కు చెందిన సెమీ అధికారిక మీడియా ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం గురించి మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్తో గొప్ప డీల్ కుదిరిందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఈరోజు రాత్రి ఇరాన్పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం' అని ప్రకటించారు.
పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఒమన్ తీరంలో వాణిజ్య నౌక ప్రమాదానికి గురైంది. ఇవాళ ఒమన్ తీరానికి సమీపంలో ‘ఎంటీ జల్వీర్’ అనే చమురు నౌకలోని ఇంజిన్ రూమ్లో అకస్మాత్తుగా పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.
రెండు రోజుల క్రితం ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించారు. సముద్రంలో గల్లంతైన ఆ ముగ్గురు భారతీయులు చనిపోయారు.
ఇరాన్పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులకు దిగింది. టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది.
ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు.
పశ్చిమాసియా మళ్లీ రణరంగమైంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ మంగళవారం కూల్చివేయటంతో దాడులు, ప్రతిదాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అట్టుడికింది.
పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్పై చేపట్టిన తాజా సైనిక చర్యలను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, భారతీయులు ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌక దాడికి గురైనట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం.