Home » IPL
రాయ్పుర్ వేదికగా మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఐ తలపడనుంది. అందులో భాగంగా రాయ్పుర్ వెళ్లేందుకు ముంబై ఆటగాళ్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కానీ అందులో హార్దిక్ పాండ్య కనిపించలేదు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై వేటు పడిందా? అనే చర్చ మొదలైంది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 భారత జట్టును ఎంచుకున్నాడు. అందులో వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్గా చోటు ఇచ్చాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ను సీఎస్కే చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. సంజు ఆటతీరుపై స్పందించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్కు సంబంధించి ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలను బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ఫైనల్ పోరుకు బెంగళూరు కాకుండా.. గుజరాత్లోని అహ్మదాబాద్ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సీఎస్కేకి 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటతీరుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. తాజాగా జియో హాట్స్టార్ నిర్వహించిన ‘సూపర్ స్టార్స్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని మాట్లాడాడు. ఒకప్పుడు తనను టీ20 ప్లేయర్గానే చూడలేదని, టెస్టు క్రికెటర్గా ముద్ర వేశారని పేర్కొన్నాడు.
లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది వేలంలో అతడిని లఖ్నవూ ఫ్రాంచైజీ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తాను పొందిన భారీ ధరకు పంత్ ఏమాత్రం న్యాయం చేయట్లేదంటూ సోషల్ మీడియలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎల్ఎస్జీ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు.
ఐపీఎల్ సీజన్ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి, పదిమంది నిందితులను అరెస్ట్ చేశారు.