Home » International News
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
ఇరాన్పై అనుకున్న సమయం కంటే ముందే దాడులను ముగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. మరికొన్ని వారాల్లో ఇరాన్ యుద్ధం ముగుస్తుందని తెలిపారు. ఇరాన్పై భూతల దాడులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ లక్ష్యాలను సాధిస్తామని అన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి మరో దేశం కూడా చేరినట్లు కనిపిస్తోంది.
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కౌవాయి (Kauai) దీవిలో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్లోని కీలక విద్యుత్, ఇంధన వ్యవస్థలపై దాడులను మరో పది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అయింది. తామే ఈ హ్యాకింగ్కు పాల్పడినట్టు ఇరాన్కు చెందిన హండాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది.
అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలతో ఏపీటీఎస్ ఛైర్మన్ మోహన కృష్ణ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి.. రాష్ట్ర ప్రగతి పథంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు.
దాదాపు నెల రోజులుగా జరుగుతున్న అమెరికా- ఇరాన్ యుద్ధం విరమణ కోసం పరోక్షంగా చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు తదుపరి సుప్రీం లీడర్గా తనను నియమిస్తామని చెప్పారని..
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే, బయటకు మరోలా మాట్లాడుతోందని ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.