Home » International News
నెదర్లాండ్స్లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సింహాసన వారసురాలు క్యాథరీనా అమాలియా, ఆమె చెల్లెలు యువరాణి అలెక్సియాలను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రణాళిక రచించాడు.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగనున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఆ దిశగా సాగుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి.
అమెరికా నౌకా దిగ్బంధనం కారణంగా ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పోర్టులను, నౌకల రవాణాను అమెరికా దిగ్బంధించిన కారణంగా ఇరాన్కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసింది.
ఇరాన్తో చేస్తున్న యుద్ధాన్ని విమర్శిస్తున్న వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని మరోసారి సమర్థించుకున్నారు. ఇరాన్తో యుద్ధంపై విమర్శలు చేస్తున్నవారిని ట్రంప్ 'దేశద్రోహులు'గా అభివర్ణించారు.
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ శాంతి చర్చల విషయంలో మాత్రం పూర్తి స్పష్టత రావడం లేదు. అమెరికా, ఇరాన్ల మధ్య ఒప్పందం విషయంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా పాక్ ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తోందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకే తాము మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నౌకా దిగ్బంధనాన్ని ఉపసంహరించుకునేది లేదని ట్రంప్ తేల్చి చెప్పడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
భారీ అవినీతి, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుమార్తె రబియా ఇమ్రాన్, ఆమె భర్త ఇమ్రాన్ యూసఫ్లకు లాహోర్ ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.