Home » International News
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతర అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్గా ఉన్న ఖర్గ్ ఐలాండ్పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు జరిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు పగ్గాలు చేపట్టినా తమ తదుపరి టార్గెట్ అయనే అవుతారని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కానీ, ఆయనకు సంబంధించిన కీలక సమాచారం కానీ అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది.
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం.
అమెరికాకు చెందిన కీలక విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’పై దాడులు చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్......
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేనంతగా మారినట్టు తెలుస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.
అమెరికా, ఇజ్రాయెల్తో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, అందుకు మూడు షరతులు విధించింది.....
తమ దేశంపై దాడులు చేపట్టిన ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు.