Home » India vs Pakistan
మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.
టీ-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ప్రశంసించారు.
టీ-20 ప్రపంచకప్లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్లోనూ, తర్వాత బౌలింగ్లోనూ మెరిసి పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఎదుట భారత్ భారీ లక్ష్యం ఉంచింది. టీ-20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్లోనే అత్యంత రసవత్తర మ్యాచ్ కొలంబోలో మొదలైంది. భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్కు వేదిక అయిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు వేలాది మంది ప్రేక్షకులు చేరుకున్నారు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు
టీ20 ప్రపంచ కప్లో హైవోల్టేజీ పోరుకు అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్కు..
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్లోనే అత్యంత రసవత్తర మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవబోతోంది. దాయాదుల పోరును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ సూపర్ మ్యాచ్కు వేదిక కాబోతోంది.
ప్రస్తుతం ఐసీసీని బీసీసీఐ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, కొలంబోలేని పిచ్ను ఏ క్షణంలోనైనా టీమిండియాకు అనుకూలాంగా మార్చవచ్చని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ సంచలన ఆరోపణలు చేశాడు.
రాబోయే టీ-20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పష్టం చేశారు. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.