Share News

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:27 AM

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..
Mohsin Naqvi stadium exit

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల ఛేజింగ్‌లో పాక్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. ఈ పరాజయం పాక్ నేతలు, క్రికెట్ అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది. ఈ నేపథ్యంలో ప్రేమదాస స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది (India vs Pakistan T20 World Cup).


ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. గ్యాలరీ నుంచి చాలా సేపు మ్యాచ్ వీక్షించారు. అయితే ఛేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది నఖ్వీ అనే సంగతి తెలిసిందే (Mohsin Naqvi stadium exit).


ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే స్టేడియంలో నఖ్వీ ఓవరాక్షన్ చేద్దామనుకున్నాడని (India thrash Pakistan), అయితే టీమిండియా దెబ్బకు ముందుగానే స్టేడియం నుంచి పారిపోవాల్సి వచ్చిందని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ పరాజయంతో పాక్ జట్టుపై ఆ దేశ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఎప్పటికీ టీమిండియాను ఓడించలేదని కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓడిపోవడం పాక్‌కు అలవాటుగా మారిందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం అభినందనలు..

Updated Date - Feb 16 , 2026 | 09:27 AM