Home » INDIA Alliance
డిబేట్లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని బి సుదర్శన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్యనే పోటీ అని చెప్పారు.
ఆగస్టు 29 నుండి వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ జపాన్, చైనాలను సందర్శిస్తారు. ఇరు దేశాల ఆహ్వానాల మేరకు ప్రధాని జపాన్, చైనాల్లో పర్యటించి..
ఉపరాష్ట్రపతి పదవి అధికారం కాదు..అది గౌరవ ప్రదమైన రాజ్యాంగ పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఉపరాష్ట్రపతి పదవికి తాను సరైన వాడినని... అర్హులైన వారిని నిర్ణయించుకొని ఓటేయాలని ఎంపీలను సుదర్శన్ రెడ్డి కోరారు.
జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. దేశంలోని ప్రముఖ, ప్రగతిశీల న్యాయవాదుల్లో సుదర్శన్ రెడ్డి ఒకరని, సుదీర్ఘమైన లీగల్ కెరీర్ కలిగి, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడంలో విఖ్యాతి పొందారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు.
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని 'ఇండియా' కూటమి భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునే వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందనే చెప్పాలి.
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు జోరు పెంచారు. తమ ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఈరోజు కీలక భేటీ జరగనుంది. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ ఆఫీస్ వరకు నిరసనగా వెళ్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.