Home » Hyderabad
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 14, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 32లకు విక్రయిస్తున్నారు.
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గాయత్రిహిల్స్ ఫీడర్ పరిధిలో కరెంట్ ఉండదని తెలిపారు.
సచివాలయంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ (SLCCC) సమావేశం జరిగింది. రాష్ట్రంలో 2027 జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడానికి సమగ్ర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ నిర్వహించి కొకైన్ ముఠా దందాను గుట్టురట్టు చేసింది. ఈ ఆపరేషన్లో 32 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకుని, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు..
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ భవనంలో వాచ్మన్ శవమై కనిపించాడు. కార్ పార్కింగ్ లిఫ్ట్ రాడ్స్కు ఉరి బిగించిన స్థితిలో వాచ్మన్ మృతదేహం లభ్యమైంది.
పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హెచ్సీయూలో ల్యాప్టాప్లు చోరీ చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 60 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు..
సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్లో ఉన్న బోనస్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తం రూ.514.36 కోట్ల నిధులను విడుదల చేసింది..
నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ స్పందించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో భేటీ అయ్యారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిన టికెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి గణంకాలతో సహా హైకమాండ్కు వివరించారు.