Home » Hyderabad
జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
హైదరాబాద్ పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు రేపు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో అండర్ పాస్లు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ప్రకటించారు.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయమవడం కలకలం రేపుతోంది. శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇటీవల పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో తండ్రి సల్మాన్.. కన్న కొడుకు అర్మాన్ను పిల్లర్కు గుద్ది రోడ్డు మీద పడేశాడు.
పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్లో ఈ నెల 13 (గురువారం) నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.