Home » Hyderabad
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కండ్లకోయ ప్రాంతంలో చెట్టుకొమ్మలు కత్తిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్, కేపీహెచ్బీ, బాలాజీనగర్ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
మత్స్య విక్రయాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చేపల విక్రయాల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ SIMMS ద్వారా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగులరాలిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.
గోల్కొండలోని ఓ హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ బాత్రూంలో ఓ యువతి ప్రసవించగా, నవజాత శిశువు మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్పామ్ పంట తెరపైకి వచ్చింది.
భాగ్యనగరంలోని పలు కాలనీల్లో కోతుల గుంపులు ప్రజలను భయాందోళనకు గురిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని విద్యానగర్ నివాస ప్రాంతంలోకి చొరబడిన కోతుల గుంపు ఓ మహిళపై ఒక్కసారిగా దాడి చేశాయి.
వేసవి తాపం ఇంకా వీడడం లేదు. నైరుతి ముఖం చాటేయడంతో తాగునీటి వ్యాపారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా సాగుతోంది.
SIR విషయంలో సీరియస్గా లేకపోవడం పట్ల పలువురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని ఫైర్ అయ్యారు.