Home » Hyderabad
గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్నగర్, హెచ్సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు నడుస్తున్నాయి.
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్ డిమాండ్ మొదలైందని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు,116 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధి జేఎన్టీయూ 33/11కేవీ సబ్స్టేషన్లో నిర్వహణ పనుల కోసం బుధవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది..
హైదరాబాద్లోని కొండాపూర్ జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా సీరియస్ అయ్యింది. దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది..
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాజులరామారంలో భారీ శబ్దంతో భూమి కంపించింది. మెట్కాన్గూడెం పరిసరాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి..
హైదరాబాద్లో పులి అవయవాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పులి గోర్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నారు..
ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ విధానాలపై ఆమె తన అభిప్రాయాలను చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు..