Home » Hyderabad City Police
ఖైరతాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న మనవడు గాయపడ్డాడు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారిత సాధించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. దాని కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో స్త్రీ రైడ్స్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
అమీర్పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాసనగర్ వెస్ట్లో, మెట్రో పిల్లర్ నంబర్ - A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో గంజాయి రవాణాకు పాల్పడిన ఓ డ్రగ్స్ పెడ్లర్ను.. ర్యాపిడో రైడర్ పట్టించాడు. ఈ సమాచారాన్ని రైడర్ పోలీసులకు వెంటనే తెలియజేయడంతో డ్రగ్స్ పెడ్లర్ను అరెస్ట్ చేశారు.
తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఈరోజు (బుధవారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూమి సమస్యకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన ఓ దంపతులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
గండిపేట వందల కోట్ల రూపాయల ల్యాండ్ నకిలీ జీవోల కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పరారీ అయ్యారని తెలిపారు.
హైదరాబాద్లో నకిలీ డిజిటల్ చెల్లింపు యాప్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బక్రీద్ సందర్భంగా గొర్రెల వ్యాపారిని మోసం చేసిన ఈ ఘటనలో ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు ప్రధాన మార్గాలను గుర్తించారు.