Home » Himanta Biswa Sarma
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11.40 గంటలకు గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గంలోకి తీసుకునే నలుగురు మంత్రుల పేర్లను శర్మ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. శర్మతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారిలో రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు పూర్తి చేసిన అనంతరం అస్సాం రాజధాని గౌహతికి సీఎం బయలుదేరారు.
ఎన్నికల మేనిఫెస్టో అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కాబోయే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తామన్నారు.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఎంపిక ఖరారైంది. ఈ మేరకు ఆయన ఈ నెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు.
పశ్చిమబెంగాల్లో తాను ఓడిపోలేదని, రాజీనామా చేసేది లేదని టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 'అప్పుడు ఒకటే మార్గం ఉంటుంది. డిస్మిస్ చేయడమే' అని ఆయన అన్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. హిమంత సైతం తన సొంత నియోజకవర్గమైన జలుక్బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 89,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అస్సాంకు కూడా కీలకమని, బంగ్లాదేశీయుల అక్రమ వలసల వల్ల హిందువులు త్వరలోనే మెజారిటీ కోల్పోనున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. బెంగాల్లో జరిగిన మొదటి విడత పోలింగ్లో బీజేపీకి వచ్చిన సపోర్ట్ చూస్తే 200కు పైగా సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్ పోలీసు కేసు పెట్టడంతో అస్సాం పోలీసుల బృందం కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా నివాసానికి మంగళవారంనాడు వెళ్లారు. రిణికి భూయాన్కు మూడు దేశాల పాస్పోర్టులు, విదేశాలతో ఆస్తులు ఉన్నాయని, వాటిని అఫిడవిట్లో సీఎం వెల్లడించకుండా దాటిపెట్టారని పవన్ ఖేడా ఇటీవల ఆరోపించారు.