Home » Himanta Biswa Sarma
లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేశారని, తద్వారా తన అరెస్ట్ని తానే కోరితెచ్చుకున్నారని అన్నారు. ఒకవేళ.. తనకు తొలిసారి సమన్లు వచ్చినప్పుడే స్పందించి ఉంటే, అరెస్ట్ అయ్యేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ ఖండిస్తూ.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) తిప్పికొట్టారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న ఏ ఏజెన్సీ వల్లనో కాదని, తన సొంత చర్యల వల్లేనని పేర్కొన్నారు. దర్యాప్తులో కేంద్ర సంస్థలకు కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. ‘మేము తినము, ఇతరుల్ని తిననివ్వము’ అనే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta Biswa Sarma) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఓ హెచ్చరిక జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన నేతల్లో చాలామంది బీజేపీలోకి (BJP) చేరుతారని పేర్కొన్నారు. కాబట్టి.. ఆ ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడంలో ఎలాంటి అర్థం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్నీ రోజులు రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగనీయనని స్పష్టం చేశారు.
అస్సాంలో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్కి (Uniform Civil Code) పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను (Muslim Marriage Registration Law) నియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఆయనను పోలిన వ్యక్తిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ తెలిపారు. యాత్రలోని కొన్ని ప్రాంతాల్లో రాహుల్ను పోలిన వ్యక్తిని వాడుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరును బయటపెడతామని చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించడమే పనిగా పెట్టుకున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు రాహుల్ గాంధీ కావాలంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే.. ఆయన సెటైరికల్ కోణంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అసోంలో దుమారం రేపుతోంది. రాహుల్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తాజాగా రాహుల్ను అరెస్టు చేసి తీరుతామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. అస్సాంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు.