Home » Heavy Rains
అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడతాయని ఏపీ విపత్త నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవ్వరూ చెట్ల కింద నిలబడరాదని సూచించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
ద్రోణి ప్రభావంతో ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి రాష్ట్రంలో విస్తరించిన కారణంగా ఈ నెల 9వ తేదీ గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. వాన భారీగా పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయిపోతున్నాయి.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.
పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వాహనాలు చేరుకునేందుకు అంతరాయం కలుగుతుండటంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన టూరిస్టులకు సాయపడేందుకు డార్జిలింగ్ పోలీసులు హెల్ప్లైన్ నెంబర్లు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.