Home » Heavy Rains
ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్.. తమిళనాడులో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్ జిల్లాకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉందని చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖా తంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా మారిందని అధికారులు తెలిపారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.
తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని స్పష్టం చేసింది వాతావరణ కేంద్రం. అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని పేర్కొంది.
ఉత్తరకోస్తా, ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్.