Home » Heavy Rains
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించాయి.
అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ తుఫాన్ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగుల్చింది. బుధవారం సాయంత్రం అనూహ్యంగా మారిన వాతావరణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెను విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కీలక హెచ్చరికలు జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
దక్షిణ శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం నుంచి తేమ గాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపుకు వీస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది.