Home » Heavy Rains
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్రెడ్డి సూచించారు.
మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం.మీ, రామయంపేట మండలంలో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో పలువురు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో ఫోన్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
లంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. కామారెడ్డి జిల్లా బికనూరు తాళమండ్ల సెక్షన్లో భారీ వరద ప్రవాహంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది.
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతోంది.
భారత వాతావరణ శాఖ జమ్మూకశ్మీర్లోని పలు ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతంలోని పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో మరిన్ని చోట్ల కొండచరియలు విరిగిపడొచ్చని, మెరుపువరదలు సంభవించవచ్చని అప్రమత్తం చేసింది.
బియాస్ నది పొంగిపొర్లుతుండటంతో మనాలిలోని ఒక బహుళ అంతస్తుల హోటల్, నాలుగు దుకాణాలు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు.