Home » Heavy Rains
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ప్రవాహం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఈ నగదును అధికారులు అందించనున్నారు.
ఈసారి మాన్సూన్ వాయవ్య భారతదేశంలో తీవ్రంగా ప్రభావం చూపించింది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఆగస్టులో 14 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నీలగిరి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన వర్షానికి గూడలూరు, పందలూరు పరిసర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. గూడలూరులోని ప్రధాన రహదారుల్లో మోకాలిలోతు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతుంది. ఎగువ నుంచి వరదనీరు వచ్చి హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల్లో చేరుతుంది. ఉస్మాన్సాగర్ సామర్థ్యం మొత్తం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.25 అడుగలకు చేరింది.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు.