Home » Harish Rao
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నేతలు సమావేశంకానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్లో ఈ సమావేశం జరుగనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీశ్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డైవర్షన్ కోసమే నోటీసులు పంపించారని ఆయన ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ నోటీసులు ఇచ్చింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి టెండర్లలో సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని.. అందుకే ఐఏఎస్, జర్నలిస్టులను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు.
చలికాలంలో ఇంట్లో ఉంటే శరీరానికి సూర్యరశ్మి అందదని.. అందువల్ల పతంగి ఎగురవేయడం చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పండుగ వేళ.. పిల్లలు, పెద్దలు అంతా బయటకు వచ్చి సాయంత్రం వరకు పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి ఎండ తగలడంతో డి విటమిన్ అందుతుందని ఆయన వివరించారు.