Home » Guntur
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసును సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, గృహ అవసరాలకు ఎక్కడా కొరత లేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల పాలకవర్గ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేషన్ల మేయర్లు స్పందించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను ఖరారు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలను మంజూరు చేయాలని నిర్ణయించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అత్యంత దుర్మార్గమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల్లో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. పాలనలో పారదర్శకత, ప్రజలకు చేరువయ్యే విధానాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత పక్కన బెట్టి, కేవలం తాడేపల్లి ప్యాలెస్లో నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్లకే పరిమితం కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పెట్టిన 10 డిమాండ్లలో 9 నెరవేర్చిందని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు.
సీఎం చంద్రబాబు మంగళవారం ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలోని ఎలైట్ ఫోర్సెస్ అయిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోలు జాతీయ స్థాయిలో మరోసారి తమ సత్తా చాటుకున్నారు. హర్యానా రాష్ట్రం మనేసర్లోని క్యాంపస్లో నిర్వహించిన 16వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీల్లో ఏపీ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది.