Home » Gulf News
మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యంగా ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్ శాస్త్రీయ పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నుంచి భారత్కు ఉపశమనం లభిస్తోంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి భారత్కు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.
ప్రపంచ ఇంధన మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి పెట్రోల్ (Gasoline) ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక అంచనా.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుతున్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చాయి. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఇజ్రాయెల్ మీద ఇరాన్ విరుచుకుపడింది. కీలకమైన హైఫా పోర్ట్పై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడి చేసింది. నౌకాదళ మరమ్మత్తు కేంద్రాలు, లాజిస్టిక్స్ విభాగాలు, భారీ ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాన్ డ్రోన్ సామర్థ్యం తగ్గిందన్న అమెరికా-ఇజ్రాయెల్ వాదనలకు ఈ దాడి సమాధానమని ఇరాన్ ప్రకటించింది.
'వాళ్లు.. 7 రోజులు అడిగితే, నేను 10 రోజులు ఇచ్చా' ఇరాన్పై దాడుల నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు మరో 10 రోజులపాటు ఉండవని చెప్పారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.