Home » Gulf News
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జోర్డాన్ లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తాజాగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఉత్తర ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా కాన్సులేట్ సమీపం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపే ప్రతీ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశపు వంతెనలు, ఒక్కో విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బెదిరించిన నేపథ్యంలో ఇరాన్ అంతే ఘాటుగా స్పందించింది. తాజాగా ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఇరు దేశాల మధ్య రాజీ ప్రయత్నాలు కుదిర్చేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు.
ఫిబ్రవరి 28న గల్ఫ్ ఉద్రిక్తతలు చెలరేగిన నాటి నుంచీ ఇప్పటివరకూ గల్ఫ్ ప్రాంతంలో 13 మంది భారతీయులు మరణించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల గల్ఫ్ ప్రాంతంలోని నాలుగు దేశాలలో జరిపిన పర్యటనలో 'ఇంధన భద్రత' అత్యంత కీలకమైన అంశంగా నిలిచిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అమెరికా జరిపిన తాజా సైనిక దాడులపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.
ఇరాన్ అణు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రపంచం ముందు ఉంచారు. ఇరాన్తో ఇతర మార్గాలను అన్వేషించే ముందు, చర్చల ద్వారా దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు నెతన్యాహు వెల్లడించారు.
హోర్మూజ్ జలసంధి చుట్టూ హైటెన్షన్ పరిస్థితులు నెలకొనడంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశ వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది.
హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ మడత పేచీ మొదలైంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు నిన్న ఇరాన్ ప్రకటించగా, ఆ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇవాళ పూర్తిగా తోసిపుచ్చింది.