Home » Google
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ కు మరోసారి నల్లుల బెడద తలెత్తింది. అయితే అదేదో గూగుల్ సంస్థకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో అనుకుంటే పొరపాటే. న్యూయార్క్ నగరంలోని గూగుల్ ఆఫీసుకు ఈ సమస్య ఎదురైంది. దీంతో ఉద్యోగులకు ముఖ్య సమాచారాన్ని గూగుల్ ఈ మెయిల్ పంపించింది.
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..
విజేతలు గా నిలిచిన ఎంతో మంది స్టోరీలు మనకు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అంతేకాక ఎంతో మంది యువతకు కూడా ఆదర్శంగా ఉంటాయి. వెయిటర్ నుంచి క్లౌడ్ సీఈఓగా ఎదిగిన ఓ వ్యక్తి..జీవితం నేటి యువతకు స్ఫూర్తి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్కు విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని.. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి, ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని అన్నారు.
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు.
గమ్యస్థానం నుంచి ‘ వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్ను, భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో ఓ ముఖ్య కార్యక్రమం జరిగింది.
విశాఖపట్నానికి గూగుల్ ఏఐ హబ్ రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభపరిణామమని అభివర్ణించారు.
డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ను లాంఛ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. అన్ని కోణాలనుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్-స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదూపాయాలు వికసిత్ భారత్కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు.