Home » GHMC
జీహెచ్ఎంసీలో మరో అవినీతి బాగోతం బయటపడింది. ఆన్లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా నగదు వసూళ్లను కొందరు అక్రమార్జన వనరుగా మార్చుకున్నారు. సంస్థలోని పౌర సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) వసూలైన పన్నును ఖజానాలో జమ చేయకుండా కొందరు ఉద్యోగులు నొక్కేశారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్లోని జూబ్లీ ఎన్క్లేవ్లో ఆక్రమణలను తొలగించింది. మెటల్ చార్మినార్ నమూనాకు ఎదురుగా హైటెక్సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని ఉన్న 3వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలం సహా మొత్తంగా 16వేల చదరపు గజాల విస్తీర్ణంలోని పార్కులు, భారీ హోటల్ షెడ్డు, రహదారులపై ఉన్న ఇతర ఆక్రమణలను గురువారం హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి.
జలమండలిలో రెవెన్యూ పెంపునకు కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్ థీమ్ పార్క్లో వాటర్ బోర్డు రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో సమావేశం అయ్యారు. డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.
భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి
వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమానికి హైదరాబాద్ వాసుల నుంచి మంచి స్పందన వచ్చింది.
సమాజంలో ఇన్నాళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు.
హిమాయత్ సాగర్ 10 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో కుల్సుంపురా ప్రాంతంలోని మూసీ నది రోడ్డు వరదలకు గురైంది. వెంటనే అధికారులు రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లించారు.
హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.
మలక్పేటలోని నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్బ్రిడ్జి నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని గ్రేటర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. స్టీల్బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని విద్యా సంస్థలకు బుధవారం, గురువారం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నీకోలస్ తెలిపారు.