Home » GHMC
వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జనం స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లో జరగనున్న నిమజ్జనానికి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో..
హైదరాబాద్ మహానగర స్థిరాస్తి రంగంలో పురోగతి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల జారీ, తద్వారా సంస్థకు వచ్చిన ఆదాయం భారీగా పెరిగింది.
హెచ్-సిటీలో భాగంగా భారీ స్థాయిలో వంతెనలు, అండర్పాస్లు నిర్మించనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలో నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనకు అంతర్గత డిజైనింగ్ సెల్ (ఇన్-హౌస్ డిజైనింగ్ సెల్)ను ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేటర్ పరిధిలో మీటరు లేని నల్లా కనెక్షన్ దారులపై వాటర్బోర్డు కొరడా ఝళిపించనుంది. ఇకనుంచి నల్లా కనెక్షన్లకు మీటర్లు తప్పనిసరి చేయాలని బోర్డు నిర్ణయించింది. నగరంలో ఉచిత తాగునీటి పథకం కింద నెలకు అర్హత ఉన్న ప్రతీ కనెక్షన్కు 20వేల లీటర్లను పంపిణీ చేస్తుండడంతో తగ్గిపోయిన ఆదాయాన్ని తిరిగి పెంచుకునేందుకు సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది.
హైదరాబాద్ మెట్రో రైలులో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో వాటిని అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య ఈ గ్రీన్ చానల్ చేపట్టారు.
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1070ను కేటాయించింది. ఇప్పటి వరకు ప్రజావాణి, ఎక్స్ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండగా.. తాజాగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టుకు క్లియరెన్స్లు చకచకా మొదలయ్యాయి.
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లను ఎత్తడంతో పాటు ట్యాంక్బండ్ (హుస్సేన్సాగర్) నుంచి నీటిని విడుదల చేయడంతో శుక్రవారం ఉదయం నుంచి మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది.
జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో(సీఎస్సీ) నగదు స్వీకరణ ఆగడం లేదు. సూపర్ స్ట్రక్చర్స్ పన్ను పేరిట జరుపుతున్న నగదు చెల్లింపులు సిబ్బందికి అక్రమార్జన వనరుగా మారుతున్నాయి. చందానగర్ సర్కిల్లోని సీఎ్ససీలో బహిర్గతమైన బాగోతంతో ఇతర కేంద్రాల్లో పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది.