Home » Floods
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ప్రవాహం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఈ నగదును అధికారులు అందించనున్నారు.
పంజాబ్ నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. సట్లెజ్, బియాస్, రావి నదులు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గురుదాస్పూర్, పఠాన్కోట్, అమృత్సర్, తరన్ తారన్, కపూర్తల, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, హోషియార్పూర్ జిల్లాలలో వందలాది గ్రామాలు మునిగిపోయాయి.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం మేఘ విస్ఫోటాలు సంభవించాయు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.
మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్మెంట్ సెల్లార్లు
తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చెరువులు, కట్టలు తెగిపోయి ప్రవహించాయి. 43 సెంటీమీటర్ల వర్షపాతంతో ఎక్కడా లేని వరద నీరు జిల్లాల్లో ప్రవహించింది.
మాజీ మంత్రి హరీశ్రావు వరద బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు.