Home » Floods
మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో కొట్టుకుపోయింది. ప్రవాహం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఈ నగదును అధికారులు అందించనున్నారు.
పంజాబ్ నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. సట్లెజ్, బియాస్, రావి నదులు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గురుదాస్పూర్, పఠాన్కోట్, అమృత్సర్, తరన్ తారన్, కపూర్తల, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, హోషియార్పూర్ జిల్లాలలో వందలాది గ్రామాలు మునిగిపోయాయి.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం మేఘ విస్ఫోటాలు సంభవించాయు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.
మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్మెంట్ సెల్లార్లు